కరోనా సెకండ్ వేవ్ లో కేసులు బాగానే పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు కూడా చాలా మంది మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. గత ఏడాది కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎంత నష్టపోయిందో తెలుసు. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు అనుకునే లోపు మళ్లీ సెకండ్ వేవ్ అంటూ కరోనా ప్రభావం ఎక్కువైపోయింది. ముంబైలో ఇప్పటికే చాలా మంది హీరో హీరోయిన్స్ కరోనా బారిన పడ్డారు. ఇక ఇప్పుడు నివేదా థామస్ కు కూడా కరోనా సోకింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ విషయాన్ని తనే స్వయంగా తెలిపింది. ”నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాను. డాక్టర్లు ఇచ్చిన సలహాలు పాటిస్తున్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి వస్తాను. నాకు సపోర్ట్గా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా నాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న మెడికల్ టీమ్కు ధన్యవాదాలు.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, క్షేమంగా ఉండండి..” అని నివేదా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.
— Nivetha Thomas (@i_nivethathomas) April 3, 2021
ఇదిలా ఉండగా నివేదా కు కోరనా పాజిటివ్ రావడంతో వకీల్ సాబ్ టీమ్ కాస్త టెన్షలో పడింది. దానికి కారణం ఏప్రిల్ 9 న వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అవుతుంది. దానికోసం ఈనాలుగు రోజులు ప్రమోషన్స్ బాగా చేయాలి. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో నివేదా థామస్ పాల్గొనడంతో టీమ్ కూడా పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పవన్ రీఎంట్రీతో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈసినిమా రీచ్ అవుతుందా లేదా చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: