సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన రాశీఖన్నా , పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ “ఇమైక్క నోడిగళ్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న రాశీఖన్నా “భ్రమమ్ “మలయాళ , “పక్కా కమర్షియల్ “తెలుగు మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి , రాశీఖన్నా జంటగా రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ “తుగ్లక్ దర్బార్ ” తమిళ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లోతన పాత్రకు రాశీఖన్నా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఫస్ట్ టైమ్ తమిళ భాషలో డబ్బింగ్ చెప్పుకుంటున్న రాశీఖన్నా మాట్లాడుతూ .. “తుగ్లక్ దర్బార్ “మూవీ లో నటిస్తున్నప్పుడు తమిళ భాషను నేర్చుకున్నాననీ, ఒక టీచర్ తో పాఠాలు చెప్పించుకున్నాననీ , ఈమూవీ లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: