కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ , లావణ్య త్రిపాఠి జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “చావు కబురు చల్లగా “మూవీ మార్చి 19 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కార్తికేయ బస్తీ బాలరాజు గాఒక మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ మూవీ లో ఆమని , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“చావు కబురు చల్లగా “మూవీ ప్రీ రిలీజ్ వేడుక 9వ తేదీ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం“చావు కబురు చల్లగా “మూవీ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. లావణ్య మాట్లాడుతూ .. “చావు కబురు చల్లగా “మూవీ కథ విన్నప్పుడు తనకు చాలా నచ్చిందనీ , కథకు ప్రేక్షకులందరూ కనెక్ట్ అవుతారనీ , ఎమోషనల్ సబ్జెక్ట్ అనీ , గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తనకు మూడవ సినిమా అనీ , హీరో కార్తికేయ మంచి కో ఆర్టిస్ట్ అనీ , దర్శకుడు కథ నరేట్ చేసినపుడు సగంలోనే ఓకే చెప్పాననీ , ఒక తెలుగు , ఒక తమిళ మూవీ కి కమిట్ అయ్యాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: