కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోతమిళ స్టార్ హీరో విక్రమ్ 60వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈసినిమాలో నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటంతో పాటు తమిళ మరియు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈసినిమా పట్ల ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో ఫీమేల్ లీడ్ యాక్ట్రెస్ ను కన్ఫామ్ చేశారు. పలు సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాణి భోజన్ ను ఈసినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటన చేశారు.కాగా ఇంకా ఈసినిమాలో బాబీ సింహా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ప్రస్తుతం అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా అనే చిత్రంలో నటిస్తున్నాడు విక్రమ్. ఇక ఆదిత్య వర్మ అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ద్వారా విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ధృవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరి తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో అప్పుడే సినిమాపై అంచనాలు కూడా ఏర్పడ్డాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: