శ్రీనివాస ఆత్రేయతో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు నవీన్ పొలిశెట్టి.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో కమర్షియల్ గా హిట్ కొట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఇక ఇప్పుడు అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న జాతిరత్నాలు.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. మార్చి 4 సాయంత్రం 4:20 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారు.
ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారనున్నారు. ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందిస్తున్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలో నటిస్తుండగా మురళీ శర్మ, నరేష్ వి.కె, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: