మోహన్లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. జీతూజోసఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయం దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా సీక్వెల్ ‘దృశ్యం 2’ కూడా తీసాడు మోహన్లాల్. ఈ సీక్వెల్ కు కూడా ‘జీతూ జోసఫ్’ దర్శకత్వం వహించాడు. ఈ ఆంటోనీ పెరంబవూర్ నిర్మించిన ఈ సీక్వెల్ థియేటర్ లో కాకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమేజాన్ ప్రైమ్ లో విడుదలయింది. ఈ సీక్వెల్ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా దృశ్యం 2 సీక్వెల్ వెంకీ చేస్తున్నట్టు కొన్ని సార్లు.. చేయనట్టు కొన్ని సార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ వార్తల్లో ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ.. తాజాగా మాత్రం ఈ సీక్వెల్ కు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. డైరెక్టర్ జీతూ జోసఫే ఈ సినిమాకు డైరెక్షన్ చేయనున్నాడట. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ని ఇప్పటికే దర్శకుడు హైదరాబాద్లో ప్రారంభించారని తెలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి. సురేష్బాబు ఈ సినిమాను నిర్మించనున్నారట. మార్చి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి..వీలైనంత తొందరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారట. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూద్దాం.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో తమిళంలో హిట్టయిన ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: