చిలసౌ సినిమా తర్వాత సుశాంత్ హీరోగా మళ్లీ ఇంతవరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. గత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఆ పాత్రకు మంచి పేరే వచ్చిందనుకోండి. ఇక ప్రస్తుతం ఎస్ దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల చాలా లేట్ అయిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. జనవరి 29 న టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా జనవరి 29 ఉదయం 9 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, నిఖిల్, కైలాస, కృష్ణచైతన్య తదితరలు నటిస్తున్నారు. A1స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: