తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ 3 సంవత్సరాల తరువాత కథానాయికగా నటించిన “క్రాక్ ” మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “, విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన “లాభం “తమిళ మూవీ షూటింగ్స్
కంప్లీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“క్రాక్ ” మూవీ ఘనవిజయం సాధించడంతో శృతి హాసన్ చాలా ఆనందంగా ఉన్నారు. శృతి మాట్లాడుతూ .. కరోనా అందరినీ ఒత్తిడి కి గురి చేసిందనీ , రిస్క్ తీసుకుని షూటింగ్స్ లో పాల్గొంటున్నామనీ , ప్రేక్షకులు థియేటర్స్ లో మూవీస్ కు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉందనీ , “క్రాక్ ” మూవీ తనకు కమ్ బ్యాక్ మూవీ అంటున్నారనీ , కానీ తాను అలా భావించడం లేదనీ , కాస్త గ్యాప్ తీసుకుని మ్యూజిక్ పై శ్రద్ధ పెట్టాననీ , గ్యాప్ రావడం తో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని టెన్షన్ పడ్డాననీ , కానీ ఎప్పటిలాగే ప్రేక్షకులు ప్రేమ , అభిమానం చూపిస్తున్నారనీ, సంక్రాంతి పండగ అనగానే గుర్తు వచ్చేది ఫుడ్ అనీ , ఆ రోజు ఇంట్లో రకరకాల వంటకాలు చేస్తారనీ , చిన్నప్పుడు తమ గ్రాండ్ మా ఇంటికి వెళ్ళి సంక్రాంతి పండగ జరుపుకొనేవారిమనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: