త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ కు బన్నీ లాంటి హీరో దొరికితే ఆ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే వారు నిరూపించారు. వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు మూడు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇక గత ఏడాది సమ్మర్ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, బన్నీ కామెడీ టైమింగ్, పూజ గ్లామర్ అన్నీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది థమన్ సాంగ్స్ గురించి. ఈ సాంగ్స్ యూ ట్యూబ్ లో క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కాదు. డేవిడ్ వార్నర్ కూడా బుట్ట బొమ్మ పాటకు వీడియో తీశాడంటే అర్థంచేసుకోండి ఎంత ఫేమస్ అయ్యాయో. అంతేకాదు హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా విడుదలై సోమవారానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం మళ్ళీ రీ యూనియన్ ను హైదరాబాద్ లోని అల్లు వారి ఆఫీస్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ ‘గత ఏడాది సంక్రాంతి తరువాత 2020 అనేది ప్రపంచానికి చాలా బ్యాడ్ ఇయర్ గా నడిచింది. అయితే నాకు మాత్రం అలా కాదు. నేను బ్యాడ్ ఇయర్ అని చెప్పలేను. ఎందుకంటే నా లైఫ్ మొత్తంలో ఇలాంటి విజయాన్ని నేను చూడలేదు. సినిమా విడుదలై ఏడాది అయినా ఇంకా ఏదో ఒక విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది… ప్రతి నటుడికీ ఏదో ఒక సమయంలో ఆల్ టైమ్ రికార్డ్ పడుతూ ఉంటుంది. నాకు 20 సినిమాలు పట్టింది. ఇది నా మొదటి అడుగు. ఇకపై నేనేంటో చూపిస్తా అని అన్నాడు.
View this post on Instagram
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: