వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో పని చేస్తున్నాడు. ప్రస్తుతం ‘కర్ణన్’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. దానితో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘జగమే తంత్రం’ సినిమా కూడా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో థ్రిల్లర్ చేస్తున్నాడు. కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ‘D43’. ఈ సినిమాను నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇందులో ధనుష్ సరసన మాళవికా మోహనన్ నటించనుండగా.. ముక్తి అమ్మన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న స్మృతి వెంకట్ ధనుష్ కు చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా వారి అంచనాలను ఏమేరకు అందుకుంటుందో చూడాలి. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.
మరోవైపు తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఆయిరాతిల్ ఒరువన్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ‘యూగానికి ఒక్కడు’ పేరుతో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు సెల్వ రాఘవన్. అంతేకాకుండా ఈ సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమా రావడానికి కొంత సమయం పడుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: