“ఎవరే అతగాడు” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. “పరుత్తి వీరన్ “తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రియమణి ప్రస్తుతం 4తెలుగు , 3 కన్నడ , ఒక హిందీ , ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న ప్రియమణిని , “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్రకు సంప్రదించినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధానపాత్రలలో రూపొందిన పొలిటికల్ డ్రామా “లూసిఫర్” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో మోహన్ లాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేయగా , మంజు వారియర్ ఒక గ్రేట్ పొలిటీషియన్ కుమార్తె గా , బాధ్యత గల మహిళగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. బ్లాక్ బస్టర్ “లూసిఫర్” మలయాళ మూవీ తెలుగు రీమేక్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనుంది. మలయాళ మూవీ లో నటించిన మంజు వారియర్ పాత్రకు ప్రియమణి ని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఈ మూవీ ఫిబ్రవరి నెలలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: