టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో కథానాయిక గా నటిస్తున్న రష్మిక “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. స్టార్ హీరోయిన్ రష్మిక పలు భాషల మూవీస్ నుండి ఆఫర్స్ అందుకుంటున్నారు. “మిషన్ మజ్ను ” మూవీ తో రష్మిక బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ ఎస్ వి పి మూవీస్ , జిబిఎ మీడియా బ్యానర్స్ పై శాంతను బాగ్చి దర్శకత్వంలో సిద్ధార్ధ్ మల్హోత్రా ,రష్మిక జంటగా థ్రిల్లర్ మూవీ “మిషన్ మజ్ను” ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ ముంబై లో ప్రారంభం అయ్యింది. హీరోయిన్ రష్మిక షూటింగ్ లో జాయిన్ అయ్యారు. “మిషన్ మజ్ను” ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తరువాత రష్మిక “పుష్ప ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా RAW ఏజెంట్ గా నటిస్తున్న “మిషన్ మజ్ను” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: