2020 లో ఎంతో మంది సినీ సెలెబ్రటీస్ మరణించిన సంగతి చూసాం. కొంత మంది వ్యక్తిగత అనారోగ్యాల వల్ల మరణిస్తే.. కొంతమంది కరోనా వల్ల.. మరికొంత మంది సూసైడ్ చేసుకున్న సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఏ రకంగా చూసినా సినీ పరిశ్రమలకు మాత్రం 2020 చేదు అనుభూతులనే మిగిల్చింది అని చెప్పొచ్చు. ఇక ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన ఈ ఏడాదిలో కూడా అప్పుడే సినీ పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ గేయ రచయితను కోల్పోవాల్సి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి నేడు తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన ఈరోజు చెన్నైలో మృతి చెందినట్టు తెలుస్తుంది. లిరిసిస్ట్గా ఎన్నో తెలుగు సినిమాలకు పాటలను రచించారు. అంతేకాదు తమిళ చిత్రాలను తెలుగులో అనువాదం చేసే విషయంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండేది.
నిజానికి వెన్నెలకంటి అసలుపేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. వెన్నెలకంటిగానే ఆయన అందరికీ పరిచయం. ఆయనకు ఇద్దరు కొడుకులు శశాంక్ వెన్నెలకంటి, రాకేందు మౌళి. ఇద్దరు తనయులు కూడా పరిశ్రమలో మంచి పేరును పొందారు. శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ చిత్రాలకు డైలాగ్ రైటర్గా పనిచేస్తుంటే.. రాకేందు మౌళి లిరిసిస్ట్, సింగర్ మరియు నటుడిగా గుర్తింపును పొందారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: