ముంబై లో పుట్టి పెరిగిన మంగుళూరు బ్యూటీ పూజాహెగ్డే సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో తెలుగు తెర కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “, “రాధేశ్యామ్ “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్” బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. కరోనా ప్రభావం తో ప్రజల జీవన విధానం మారిపోయిందనీ, కరోనా పరిస్థితులు తన వ్యక్తిత్వాన్ని ఎంతగానో తీర్చిదిద్దాయనీ , ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఆశావహ దృక్పథం తో ఆలోచించాలనే విషయం తెలిసిందనీ, లాక్ డౌన్ సమయం లో వంట చేయడం , గిటార్ నేర్చుకున్నాననీ, యోగా తనలో మార్పు తెచ్చిందనీ , తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్లే ఈ స్థాయి లో ఉన్నాననీ , పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉందనీ , సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలతో నటించడం తో నటనా పరం గా లోటుపాట్లను సరిదిద్దుకొనే అవకాశం లభిస్తుందనీ, ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా తాను స్వయం కృషి తో ఈ స్థాయి లో ఉండడం గర్వం గా ఉందనీ , ఒక్క రోజు కూడా విరామం లేకుండా ఉన్న తన బిజీ లైఫ్ ను ఆస్వాదిస్తున్నాననీ , తెలుగు , హిందీ భాషల మూవీస్ లో బిజీగా ఉన్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: