బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తెలంగాణ యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాష చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి ప్రస్తుతం “విరాటపర్వం “, “లవ్ స్టోరీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. హీరో నాని కథానాయకుడిగా రూపొందనున్న “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో సాయి పల్లవి కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జార్జియా దేశంలో MBBS చదివిన సాయి పల్లవి తన ఫీలింగ్స్ ను వెల్లడించారు. కొవిడ్ -19 నుండి ప్రజలను రక్షించడానికి డాక్టర్స్ ఎంతగానో శ్రమిస్తున్నారనీ, ఈ సమయం లో తన చదువు ఉపయోగపడలేదని చాలా బాధ పడ్డాననీ, లాక్ డౌన్ లో మెడికల్ ఎగ్జామ్ అటెండ్ చేశాననీ, లాక్ డౌన్ కు ముందే ఆ మెడికల్ ఎగ్జామ్ కు అటెండ్ అయివుంటే వైద్య సేవలకు ఉపయోగ పడేదాన్ననీ , ఇటువంటి అత్యవసర పరిస్థితులలో ప్రజలకు డాక్టర్ గా సేవలు అందించలేకపోయానని సాయి పల్లవి ఫీల్ అయ్యారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: