సూపర్ స్టార్ మహేష్ బాబు నట ప్రస్థానానికి 41ఏళ్లు అయ్యాయి. అదేంటీ ఇటీవలే కదా 21 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు కదా.. ఇప్పుడు 41 ఏళ్ళు అన్న డౌట్ వస్తుంది కదా. అసలు సంగతేంటంటే.. మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే.. బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘నీడ’ అనే చిత్రంతో బాల నటుడిగా 1979లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఇక ఈ సినిమా నేటితో 41 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్స్టాగ్రమ్ ద్వారా ఈ విషయాన్ని గుర్తుచేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే మరెన్నో సక్సెస్లు అందుకోవాలని కోరుకుంటున్నట్లుగానూ తన పోస్ట్లో తెలిపింది. మరోపక్క మహేష్ బాబు అభిమానులు కూడా మహేష్ కు అభినందనలు తెలుపుతున్నారు.
View this post on Instagram
ఇక పలు సినిమాల్లో బాలనటుడిగా చేసిన తర్వాత రాజకుమారుడు సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు మహేష్. ఇక హీరోగా ఈ 21 ఏళ్లలో ఎన్నో జయాపజయాలను చవిచూశారు. మురారి, అతడు, ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ లభించాయి.
ప్రస్తుతం మహేష్ తన తర్వాత సినిమా పరుశురాం తో చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: