పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రాధేశ్యామ్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కనున్న “ఆది పురుష్” మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టి – సిరీస్ ఫిల్మ్స్ , రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైథలాజికల్ మూవీ “ఆదిపురుష్ ” తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కనుంది. 3D ఫార్మాట్ లో తెరకెక్కనున్న ఈ మూవీ లో రాముడిగా ప్రభాస్ , లంకేశ్వరుడు గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సీత గా పలువురి హీరోయిన్స్ పేర్లు వినిపించినా ఫైనల్ గా కృతి సనన్ ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ “1:నేనొక్కడినే ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్, సూపర్ హిట్ “హీరోపంతి “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “దోచేయ్ ” మూవీ లో హీరో నాగచైతన్య కు జోడీగా నటించిన కృతి బాలీవుడ్ మూవీస్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కృతి ప్రస్తుతం “మిమి “, హమ్ దో హమారే దో ” మూవీస్ లో నటిస్తున్నారు. జనవరి నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న “ఆది పురుష్” మూవీ కి ప్రభాస్ 70రోజులు కాల్ షీట్స్ ఇచ్చారు. షూటింగ్ పార్ట్ వేగంగా కంప్లీట్ అయినా VFX కు ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. “ఆది పురుష్” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ , పలు ఫారిన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: