‘కెరటం “మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ ఫుల్ “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” మూవీ తో గుర్తింపు పొందారు. “లౌక్యం “, “కరెంట్ తీగ “, “పండగ చేస్కో “, “నాన్నకు ప్రేమతో “, “సరైనోడు “, “ధృవ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో రకుల్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు మూవీస్ తోపాటు రకుల్ తమిళ , హిందీ భాష లలో సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రకుల్ ప్రస్తుతం దర్శకుడు క్రిష్ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
స్టార్ హీరోయిన్ రకుల్ తెలుగు లో “చెక్ “, తమిళ భాషలో 2 , హిందీ భాషలో 3 సినిమాలలో కథానాయికగా నటిస్తున్నారు. టాలీవుడ్ లో తన జర్నీ కి 7సంవత్సరాలనీ , ఒక ఢిల్లీ అమ్మాయి పక్కా తెలుగు అమ్మాయిగా సాగిన తన ప్రయాణం అందమైనదనీ , తనకు సపోర్ట్ చేసిన దర్శక , నిర్మాతలు , సహ నటులు , అభిమానులకు ధన్యవాదాలనీ , తన కుటుంబం , మేనేజర్ , ఇతర సిబ్బంది సహకారంతోనే ఈ సక్సెస్ ఫుల్ జర్నీ సాధ్యమైందనీ అంటూ 7సంవత్సరాల క్రితం ఫొటో ను , ప్రస్తుత ఫొటో ను రకుల్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: