హీరో రాజశేఖర్ కుటుంబం కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ అందరికీ ఒకేసారి కరోనా రాగ ముందు పిల్లలు శివాని, శివాత్మికలు కరోనా నుండి కోలుకోగా ఆ తర్వాత జీవిత కూడా తొందరగానే కోలుకుంది. అయితే రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై మాత్రం కొన్ని రోజులు టెన్షన్ నడిచింది. కొద్దిరోజులు పలు రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత శివాని, శివాత్మికలే రాజశేఖర్ హెల్త్ గురించి రెగ్యులర్ అప్ డేట్స్ ఇచ్చారు. అయితే చాలా రోజులు టెన్షన్ తర్వాత ఫైనల్లీ రాజశేఖర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా తన కరోనా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు రాజశేఖర్. నాకు కరోనా లక్షణాలు పూర్తి స్థాయిలో వచ్చాయి.. రుచి వాసన కూడా తెలియలేదు ఆ తర్వాత శ్వాస తీసుకోడానికి కూడా చాలా కష్టపడ్డాను ఆతర్వాత హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను అని చెప్పాడు. ఆ టైం లో సరిగ్గా తినకపోవడంవల్ల దాదాపు 10 కేజీలు బరువు తగ్గిపోయాను అని చెప్పాడు. నాకు అప్పుడు అర్థమైంది.. కరోనా ప్రభావం ఎంత ఉందో అని.. దీనివల్ల చిన్నపాటి పానిక్ కు గురయ్యాం మా కుటుంబం అంతా.. ఇప్పుడు కొంచం నార్మల్ అయింది అని చెప్పుకొచ్చారు. అందరి ప్రార్ధనల వల్లే కోలుకున్నానని అన్నారు.
ఇక గరుడవేగతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత వచ్చిన కల్కి కూడా బాగానే ఆడింది. అయితే కల్కి తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు రాజశేఖర్. ప్రస్తుతం నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నీలకంఠతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక లు ఎంఎల్వి సత్యనారాయణ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: