రాయల్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎమ్ ఐ ఖురేషి మనవరాలు , నిర్మాత , దర్శకుడు సాజిద్ ఖురేషి తనయ అమ్రిన్ ఖురేషి రెండు బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. శివ శివాని స్కూల్ లో చదువుకున్న హైదరాబాద్ అమ్మాయి అమ్రిన్ ఖురేషి బాలీవుడ్ లో కథానాయిక గా ఎంపిక కావడం హాట్ టాపిక్ గా మారింది. సూపర్ హిట్ “సినిమా చూపిస్త మావ “, “జులాయి “మూవీస్ బాలీవుడ్ లో రీమేక్ కానున్నాయి. ఈ రెండు రీమేక్ మూవీస్ లో అమ్రిన్ ఖురేషి కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్ పై రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి , అమ్రిన్ ఖురేషి జంటగా “సినిమా చూపిస్త మావ ” హిందీ రీమేక్ “బ్యాడ్ బాయ్ “మూవీ రూపొందుతుంది. ఇన్ బాక్స్ పిక్చర్స్ బ్యానర్ పై టోనీ డిసౌజా దర్శకత్వంలో నమషి చక్రవర్తి , అమ్రిన్ ఖురేషి జంటగా “జులాయి “మూవీ హిందీ రీమేక్ మూవీ షూటింగ్ జనవరి లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అమ్రిన్ మాట్లాడుతూ .. హిందీ మూవీస్ తో పాటు సౌత్ లాంగ్వేజెస్ మూవీస్ లో కూడా నటించాలనే కోరిక ను వెల్లడించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: