బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “హిందీ రీమేక్ “కబీర్ సింగ్ “మూవీ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి కియారా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. “కబీర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో కియారా పలు మూవీ ఆఫర్స్ అందుకుంటూ బిజీగా మారారు. కియారా ప్రస్తుతం “షేర్ షా”, “భూల్ బులయ్యా 2 “, “జగ్ జగ్ జియో” మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్స్ రన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. టి – సిరీస్ , ఎమ్మే ఎంటర్ టైన్ మెంట్ , ఎలక్ట్రిక్ ఆపిల్స్ బ్యానర్స్ పై కియారా అద్వానీ ప్రధాన పాత్రలో రూపొందిన “ఇందూ కి జవానీ “మూవీ డిసెంబర్ 11 వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కియారా అద్వానీ ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా రూపొందిన ఈ మూవీ కి మిల్కా సింగ్ సంగీతం అందించారు. రవితేజ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “ఇడియట్ “మూవీ లోని “చూపుల్తో గుచ్చి గుచ్చి “సాంగ్ ను “ఇందూ కి జవానీ ” మూవీ లో రీమిక్స్ చేయడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: