కరోనా పై ఇప్పటికే రెండు మూడు సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యాక్ డ్రాప్ తో మరో సినిమా వస్తుంది. రమేష్ రాపర్తి దర్శకత్వంలో అనసూయ భరద్వాజ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ‘థ్యాంక్ యు బ్రదర్’ అనే టైటిల్ ను పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ టైటిల్ పోస్టర్ను హీరో రానా దగ్గుబాటి లాంచ్ చేశారు. ఆ పోస్టర్లో ఓ లిఫ్ట్, దాని ఎదురుగా ఫ్లోర్ మీద పడి ఉన్న మాస్క్ కనిపిస్తున్నాయి. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రానా షేర్ చేసిన వీడియోలో యూనిట్ మెంబర్స్ను ఒక్కొక్కరినే మాస్క్ పెట్టుకోమని అడిగి, వారు మాస్క్ పెట్టుకోగానే థ్యాంక్ యు బ్రదర్ అని చెప్పడం కరోనా కాలంలో మాస్క్ ప్రాధాన్యాన్ని చెప్తున్నట్లే కనిపిస్తోంది. టైటిల్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. త్వరలో ఫస్ట్ లుక్ను విడుదల చేయనున్నారు.
Presenting to you “TYB” wishing the director and my old friend Ramesh and his team all the very best.#ThankYouBrother@anusuyakhasba #AshwinViraj@Monie_kaa@Raparthy #MaguntaSarathChandraReddy@sureshragutu1@justordinaryent@harshachemudu@anishkuruvilla@AadarshBKrishna pic.twitter.com/pajCuBJPy9
— Rana Daggubati (@RanaDaggubati) November 20, 2020
కాగా ఇంకా ఈ సినిమాలో వైవా హర్ష, అర్చనా అనంత్, అనీష్ కురువిల్లా, మౌనికా రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, కాదంబరి కిరణ్, అన్నపూర్ణ, బాబీ రాఘవేంద్ర, సమీర్ తదితరులు నటిస్తున్నారు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మాగుంట శరత్చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరిడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తుండగా, గుణ బాలసుబ్రమణియన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: