కరోనా ప్రభావం కాస్త తగ్గినట్టు అనిపిస్తున్నాఇప్పుడప్పుడే రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇక సెలెబ్రిటీస్ కూడా నిర్లక్ష్యం వద్దని జాగ్రత్తగా ఉండమని తమ సోషల్ మీడియా ద్వారా చెపుతూనే ఉన్నారు. ఇప్పుడు శృతి హాసన్ కూడా మరొకసారి తన సోషల్ మీడియా వేదికగా జాగ్రత్తలు తీసుకోమని చెపుతుంది. కోవిడ్ అనేది సీరియస్ హెల్త్ రిస్క్.. కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు.. సెట్స్ లో నిబంధనలు పాటించనప్పుడు ఒక వ్యక్తిగా ఒక నటిగా నా హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకునే రైట్ నాకుంది అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
COVID is a serious health risk everyone ! The pandemic is not over ! I as a person and an actor have the right to prioritise my safety and health if protocols are not followed ! Just saying
— shruti haasan (@shrutihaasan) November 19, 2020
కాగా చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత క్రాక్ సినిమాతో శ్రుతి హాసన్ టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
దీనితోపాటు ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో కూడా శృతిహాసన్ నటించనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కూడా నటిస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: