ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయి రామ్ శంకర్ “143 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “నేనింతే “, “బంపర్ ఆఫర్ “, హలో ప్రేమిస్తారా”, రోమియో “, నేనో రకం “వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎస్ ఎస్ మురళీ కృష్ణ దర్శకత్వంలో సాయి రామ్ శంకర్ , రాశీసింగ్ జంటగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రీసౌండ్ ” మూవీ షూటింగ్ 70 శాతం కంప్లీట్ చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కారణంగా నిలిచిపోయిన “రీసౌండ్ ” మూవీ షూటింగ్ నిన్న (సోమవారం ) పునః ప్రారంభం అయ్యింది. పోసాని , అరవింద్ కృష్ణ , పింకీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్య సన్నివేశాలను దర్శకుడు మురళీకృష్ణ తెరకెక్కిస్తున్నారు. “రీసౌండ్ “మూవీ కి సురేష్ రెడ్డి , అయ్యప్పరాజు , రాజారెడ్డి నిర్మాతలు. “రీసౌండ్ ” మూవీ సాయిరామ్ సినీ కెరీర్ కు
టర్నింగ్ పాయింట్ గా నిలవాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: