గ్రీన్ ఛాలెంజ్ ఇప్పటివరకూ ఎంతో మంది సినీ సెలెబ్రిటీస్ పాల్గొని మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు మరో హీరో నిఖిల్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. రాజా రవీంద్ర విసిరిన ఛాలెంజ్ను స్వీకరించిన నిఖిల్ తాజాగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని అవతార్ నివాస గృహా సముదాయంలో మొక్కలు నాటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సంధర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది.. సంతోష్ కుమార్ గారు చేపట్టిన చాలా బావుంది.. స్టాలిన్ సినిమాలోలాగా ఒకరు ముగ్గురికి సాయం చేసినట్టు.. ఒకరు ముగ్గురితో మొక్కలు నటించడం అనేది చాలా వినూత్నంగా.. గొప్పగా కూడా ఉందని చెప్పాడు. అనంతరం ఈ ఛాలెంజ్ ను తన ’18 పేజీస్’ సినిమా బృందానికి ఇంకా ముగ్గురు హీరోయిన్స్ అనుపమా పరమేశ్వరన్, అవికా గోర్, కలర్స్ స్వాతి కి విసిరాడు.
Iv accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge
frm @Rajaraveendar Planted 3 saplings.
I am nominating the entire #18pages team nd my Heroines @anupamahere @avika_n_joy #Swathi
to plant 3 trees & continue the chain..special thanks 2 @MPsantoshtrs 4 taking this initiative pic.twitter.com/RbJXD4e4jw— Nikhil Siddhartha (@actor_Nikhil) November 17, 2020
కాగా ప్రస్తుతం కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజీస్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కరోనా వలన షూటింగ్కు బ్రేక్ పడింది. అయితే మళ్లీ ఇన్ని నెలలు తర్వాత షూట్ ను స్టార్ట్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ సీక్వెల్ ‘కార్తికేయ2’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: