హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ‘శశి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన జోడీగా సురభి నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో నాయిక పాత్రను రాశీ సింగ్ కూడా నటిస్తుంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఆర్.పి. వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ అమర్నాథ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమాతో వచ్చేస్తున్నాడు. కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వంలో ‘జంగిల్’ అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.‘చీకటిగా ఓ ఇల్లు ఆ ఇంటి నుండి అస్థిపంజరాలు.. దీపం కాంతిలో వాటిని చూస్తూ షాకవుతున్న హీరో ఆది, హీరోయిన్ వేదిక’.. ఇదే జంగిల్ ఫస్ట్ లుక్. కాగా ఆరా సినిమాస్ బ్యానర్స్పై మహేష్ గోవిందరాజ్, అర్చనా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’.
ఈ సందర్భంగా నిర్మాతలు మహేష్ గోవిందరాజ్, అర్చనా చందా మాట్లాడుతూ ‘‘హారర్ చిత్రాలను ఎన్నింటినో తెలుగు ప్రేక్షకులు తెరపై చూసి థ్రిల్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మరో డిఫరెంట్ కంటెంట్తో రూపొందిన జంగిల్ సినిమాతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నాం. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. త్వరలోనే టీజర్, సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తాం అని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.