ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ “దృశ్యం “మలయాళ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో మోహన్ లాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బెస్ట్ ఫిల్మ్ గా కేరళ స్టేట్ , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న “దృశ్యం ” మూవీ తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , సింహళ భాషలలో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది. చైనీస్ భాషలో రీమేక్ జరుపుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీ గా “దృశ్యం ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ , మీనా జంటగా బ్లాక్ బస్టర్ “దృశ్యం ” మూవీ సీక్వెల్ “దృశ్యం 2 ” మూవీ సెప్టెంబర్ 21 వ తేదీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. కరోనా టైమ్ లో 43 రోజులలో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొనడం విశేషం. షూటింగ్ లొకేషన్ ఫొటోలను హీరో మోహన్ లాల్ సోషల్ మీడియా లో షేర్ చేసిన విషయం తెలిసిందే. “దృశ్యం 2 ” మూవీ షూటింగ్ చివరి రోజు తీసుకున్న ఫొటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో షేర్ చేసింది. “దృశ్యం ” మలయాళ మూవీ తెలుగు రీమేక్ “దృశ్యం” మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో వెంకటేష్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: