రానా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా వున్నాడు. ప్రస్తుతం ‘విరాట పర్వం’, అరణ్య సినిమాలతో బిజీ గా ఉన్నాడు. కరోనా లేకపోతే ఈ సినిమాలు ఎప్పుడో రిలీజ్ అయ్యేవి. కానీ కరోనా వల్ల అది కుదరలేదు. అయితే ఇప్పుడు తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇచ్చిన అప్ డేట్ దగ్గుబాటి ఫ్యాన్స్ ను దిల్ కుష్ చేస్తుంది. ఇంతకీ రానా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చెప్పొడో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా త్వరలోనే బాబాయ్ వెంకటేష్ తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పాడు. ఇప్పటికే కథ ఒకే అయిందని… నేను కూడా చాలా ఎగ్జయిట్ మెంట్ తో ఉన్నా అని తెలిపాడు. నిజానికి మా ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా తప్పులు ఉంటే చాలా ఓపెన్ గా చెపుతారు.. అయితే రీసెంట్ గానే బాబాయ్ అరణ్య సినిమా చూశారని.. మొదటిసారి బాబాయ్ సినిమా చూసి కాంప్లిమెంట్ ఇచ్చారని తెలిపాడు.
ఇప్పటికే వెంకీ మేనల్లుడు నాగ చైతన్యతో వెంకీమామ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. మరి రానా ఇచ్చిన ఈ అప్ డేట్ తో అటు వెంకటేష్ అభిమానులతో పాటు రానా అభిమానులు కూడా క్రేజీ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా తెరకెక్కిన “హాథీ మేరే సాథీ ” సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. తెలుగులో ‘అరణ్య’, తమిళ్లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. వచ్చేఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే తెలిపాడు. రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో `విరాట పర్వం`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: