బిగ్ బాస్ 4 – మొన్న ఇచ్చిన ‘పల్లెకు పోదాం ఛలో ఛలో’ టాస్క్ నిన్న కూడా అదే కొనసాగింది. ఒకరకంగా నిన్న కంప్లీట్ అవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఆడియన్స్. ఇక నిన్న ఎపిసోడ్ లో స్టార్టింగే తనకు ఆమ్లెట్ కావాలని అరియానా కోరగా కుదరదని అభిజిత్ చెప్పాడు. దీంతో ప్రతిసారి ఆహారం దగ్గరే టాస్క్ ఆపేస్తారని.. ఇందుకే, నీ గేమ్ నచ్చదని అభిజిత్ను ముఖం పట్టుకుని అనేసింది. దీంతో అభి.. తెలుసుకుని మాట్లాడు అంటూ సీరియస్ అయ్యాడు. ఇక అరియానా తరపున అమ్మ రాజశేఖర్ కిచెన్ లోకి వెళ్లి ఆమ్లెట్ కావాలని అడగగా దానికి అభి ఆమ్లెట్ ఇవ్వాలంటే ఇంకా ఎక్కువ బియ్యం ఇవ్వాలని చెప్పడంతో మోనాల్ ప్లేటులో పట్టుకున్న ఫుడ్డును పాడు చేసి వెళ్లిపోయాడు. ఇక ఈ విషయంలో మళ్లీ అందరూ ఒకదగ్గర కూర్చొని దీని గురించి మాట్లాడి నిర్ణయం చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తర్వాత సీక్రెట్ టాస్క్లో భాగంగా హారిక అవినాష్ను రెచ్చగొట్టింది. తనకు రెండు పాన్ లు ఇవ్వాలని అవినాష్ ను అడిగితే ఇవ్వనని చెప్పడంతో అసలు గొడవ మొదలైంది. ఈ ఇష్యూ లో అఖిల్ కూడా కలగచేసుకువడంతో హారిక టాస్క్ ఇంకా ఈజీ ఆ ముగిసింది. ఆ వెంటనే గ్రామంలో మరో హత్య జరిగిందని బిగ్బాస్ ప్రకటించగా అమ్మ రాజశేఖరే ఈ హత్యలు చేస్తున్నాడని అందరూ అనుమానించారు
ఆ వెంటనే హారిక హౌస్ లోపల అద్దంపై లిప్స్టిక్తో మెహబూబ్ చనిపోయాడు అని రాయడంతో ఆఖరు హత్య కూడా జరిగిపోయింది. తర్వాత పంచాయితీలో కూడా గ్రామపెద్ద సోహైల్ హారికే హంతకురాలని తీర్పు చెప్పాడు. కానీ అప్పటికే హత్యలు జరిగిపోవడంతో లాభం లేకపోయింది. ఫైనల్ గా టాస్క్ పూర్తయింది.నాగార్జున చెప్పినదాని ప్రకారం మాస్టర్, సీక్రెట్ టాస్క్ గెలిచి హారిక, కెప్టెన్ అరియానా కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.
ఆ తర్వాత టాస్కులో వరస్ట్ పర్ఫామెన్స్ అడిగితే నీ పేరే చెప్పేదాన్ని అనడంతో అవినాష్ హర్ట్ అయ్యాడు. ‘నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు, అది నాకు నచ్చట్లేదు, నా గురించి నువ్వు మాట్లాడకపోతేనే బెటర్’ అని సలహా ఇచ్చాడు.
అనంతరం ఇంటిసభ్యులు సమాజం కోసం కానీ, వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటనలను కానీ చెప్పాల్సి ఉంటుంది. ఎవరు చెప్పింది అందరినీ కదిలించివేస్తుందో వారిని బెస్ట్గా ఎంపిక చేయాల్సి ఉంటుంది. మొదట సోహైల్ మాట్లాడుతూ.. “నా స్నేహితుడి భార్యకు అప్పటికే రెండుసార్లు గర్భస్రావం అయ్యింది. మూడోసారి గర్భం దాల్చిన సమయంలో ఓ రోజు నాకు వాడు అర్ధరాత్రి ఫోన్ చేశాడు. అర్జంట్గా డబ్బులు కావాలన్నాడు. సమయానికి నా దగ్గర లేకపోయేసరికి మా వాళ్లను అడిగి 15 వేలు ఇచ్చాను. కానీ తర్వాతి రోజే 10 లక్షలు అవుతుందన్నారు. సోషల్ మీడియాలో సాయం కోసం పోస్టు పెట్టి 10 లక్షలు సమకూర్చాను. వాడు ఎమోషనలై.. జీవితాంతం నీకు, సమాజానికి రుణపడి ఉంటానని నాతో అన్నాడు నాకు కూడా గర్వంగా అనిపించింది” అని చెప్పుకొచ్చాడు.
లాస్య మాట్లాడుతూ.. “2010లో నాకు పెళ్లి అయింది. 2012లో కలిసి ఉన్నాం. 2014 జనవరిలో నాన్న దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది. ముందు సెటిల్ అవండి. తర్వాత వాళ్లే స్వయంగా పెళ్లి చేస్తాం అన్నారు. అది చూసి హ్యాపీగా ఫీలయ్యాను. కానీ అదే వారం నేను ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వెళ్తే గర్భవతిని అని చెప్పారు. కానీ ఫ్యామిలీకి చెప్పుకోలేక అబార్షన్ చేసుకున్నాను. 2017లో మళ్లీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. ఐదు నెలలకే నేను మళ్లీ గర్భవతినయ్యా. కానీ నిలవలేదు. 2018లో నా పొట్టలోకి జున్ను వచ్చాడు. ఆ తర్వాత నా లైఫ్ మారిపోయింది. కానీ నా మొదటి బిడ్డను నేనే చంపేసుకున్నాను అన్న బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది” అని ఏడ్చేసింది. అందరూ లాస్య చెప్పిన ఘటనతో భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఎవరి ఘటనలు వారు చెప్పగా వాటిలో ది బెస్ట్ అనిపించడంతో ఆమెకు ఒప్పో దివాళి ఎడిషన్ ఫోన్ను అందించారు.
ఇక ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. మరి ఇందులో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మాత్రం ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: