బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేట్ అయిన నిధి అగర్వాల్ బాలెట్ , కథక్ , బెల్లీ డ్యాన్స్ లలో ట్రైనింగ్ పొందారు. “మున్నా మైఖేల్ “బాలీవుడ్ మూవీ తో కెరీర్ ప్రారంభించిన నిధి “సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిధి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు లో ఒక మూవీ లో నటిస్తున్న నిధి “జేమ్స్ ” మూవీ తో శాండల్ వుడ్ ,”భూమి ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఇప్పుడు నిధి మరో తమిళ మూవీ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు కథానాయకుడిగా “ఈశ్వరన్ ” (ఈశ్వరుడు) తమిళ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో శింబు కు జోడీగా నిధి నటిస్తున్నారు. “ఈశ్వరన్ “తమిళ మూవీ షూటింగ్ మదురై లో జరుగుతుంది. ఈ మూవీ సెట్స్ లో నిధి అడుగుపెట్టారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చిన తరువాతే బయటకు అడుగు పెట్టాలనే నిర్ణయం తో ఉన్న నిధి మాట్లాడుతూ ..7 నెలలపాటు ఇంటికే పరిమితం అయ్యాననీ , షూటింగ్స్ ప్రారంభం కావడం తో నిర్ణయం మార్చుకొన్నాననీ , కొవిడ్ -19 భయాలన్నీ వదలిపెట్టి “ఈశ్వరన్ ” మూవీ షూటింగ్ లో పాల్గొన్నాననీ , చాలాకాలం తరువాత షూటింగ్ లో పాల్గొనడంతో సంతోషంగా ఉందనీ , కరోనా ప్రికాషన్స్ తో సేఫ్ గా ఉన్న తాను నాన్ స్టాప్ గా వర్క్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: