“సొంతం “మూవీ తో నటుడిగా కెరీర్ ప్రారంభించిన అడివి శేష్ “బలుపు “, “రన్ రాజా రన్ “, “బాహుబలి ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. సక్సెస్ ఫుల్ “క్షణం “మూవీ తో హీరోగా మారిన అడివి శేష్ “గూఢచారి “, “ఎవరు “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా “క్షణం “మూవీ కి నంది అవార్డ్ , “గూఢచారి “మూవీ కి జీ సినీ అవార్డ్ శేష్ అందుకున్నారు. రైటర్ , హీరోగా అడివి శేష్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “మేజర్ “, “గూఢచారి 2 ” మూవీస్ కు పనిచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోనీ ఇంటర్ నేషనల్ ప్రొడక్షన్స్ , జి మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “గూఢచారి “మూవీ ఫేమ్ శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా 26/11 ముంబై దాడుల్లో పాల్గొన్న మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో “మేజర్ ” మూవీ తెరకెక్కుతుంది. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన “మేజర్ ” మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. లాక్ డౌన్ సమయాన్ని హీరో అడివి శేష్ ఫిట్ నెస్ కొరకు వినియోగించుకున్నారు. వర్కౌట్స్ తో ఫిట్ గా మారిన అడివి శేష్ షూటింగ్ కు సిద్ధమే అన్నట్టున్న ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: