గతకొద్ది రోజుల క్రితం రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత కరోనా బారిన పడ్డామని రాజశేఖర్ స్వయంగా పేర్కొనడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే పిల్లలు శివాని.. శివాత్మిక భార్య జీవిత రికవరీ అవ్వగా రాజశేఖర్ మాత్రమే ఇంకా కరోనాతో పోరాడుతూనే వున్నారు. సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో రాజశేఖర్ మాత్రం ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో శివాని.. శివాత్మిక.. వైద్య సిబ్బంది రాజశేఖర్ హెల్త్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే వున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుపుతూ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి యాజమాన్యం. ప్రస్తుతం ఐసీయూలోనే రాజశేఖర్కి చికిత్స అందిస్తున్నామని, ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని.. నాన్ ఇన్వాసివ్ వెంటిలేటర్ తొలగించామని, ప్లాస్మా థెరపీతో పాటు సైటోసోర్బ్ థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిందని తాజా బులెటిన్లో పేర్కొన్నారు సిటీ న్యూరో సెంటర్ వైద్యులు. దీంతో రాజశేఖర్ అభిమానులు కాస్త ఊరట చెందారు.
ఇక గరుడవేగతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత వచ్చిన కల్కి కూడా బాగానే ఆడింది. అయితే కల్కి తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు రాజశేఖర్. ప్రస్తుతం నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నీలకంఠతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక లు ఎంఎల్వి సత్యనారాయణ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: