ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది. ఇక ఇటీవలే షూటింగ్ ను మళ్లీ స్టార్ చేశారు. ఇక ఇన్ని రోజులు ఇక్కడే చిత్రీకరణ జరుపుకున్న చిత్రబృందం ఇప్పుడు ఈ సినిమా కోసం హిమాలయాలకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక అక్కడకు వెళ్లిన నాగ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో వీడియో ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో నాగ్ హాయ్.. రోహ్ తంగ్ పాస్ దగ్గర బ్యూటిఫుల్ మార్నింగ్. సముద్రమట్టానికి 3980 మీటర్ల ఎత్తులో అంటే 13వేల ఫీట్లు. ఇది చాలా డేంజరస్ పాస్. నవంబర్ నుంచి మే వరకు దీన్ని మూసివేస్తారు. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం ఇక్కడికొచ్చాం. షూటింగ్ చాలా బాగా జరుగుతుంది.అందమైన పర్వతాలు, నీలాకాశం, వాటర్ ఫాల్స్..7 నెలల తర్వాత ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ కు రావడం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ 21 రోజుల్లో పూర్తయిపోతుంది. ఆ తర్వాత వచ్చేస్తాను..లవ్ యూ ఆల్ అని తెలిపారు.
#WildDog in the Himalayas!! pic.twitter.com/k1gf1fNb7E
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 23, 2020
ఇంకా దీనితోపాటు హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాను కూడా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇంకా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘నాన్ రుద్రన్’ భారీ మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటితోపాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: