సినిమా థియేటర్స్ ఇంకా ఓపెన్ చేయకపోయినా … సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి ఉన్నా మన హీరోలు మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక కూడా వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాతో పాటు నూతన దర్శకుడు శ్రీకార్తీక్ డైరెక్ట్ దర్శకత్వంలో ఇంకా టైటిల్ పెట్టని తెలుగు, తమిళ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది.
తాజాగా మరో సినిమాను ప్రకటించేందుకు సిద్దమవుతున్నాడు శర్వా. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ఈ చిత్రం చేయనుండగా.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. అంతేకాదు తాజా సమాచారం ప్రకారం తిరుపతిలో అక్టోబర్ 25న దసరా కానుకగా కొత్త సినిమాకు లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే టైటిల్ ను పెట్టారట. సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: