జనాలు సోషల్ మీడియా బాగా అలవాటు పడ్డ తర్వాత దేనికి విమర్శిస్తారో.. దేనికి పొగుడుతారో.. ఏ విషయం వార్తల్లోకి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నెటిజెన్ల కామెంట్స్ కు ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ బలవ్వగా తాజాగా నటుడు బ్రహ్మాజీకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆఖరికి ట్విట్టర్ అకౌంట్ కూడా డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. అసలు సంగతేంటంటే.. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ వాసులను కుండపోత వర్షాలు కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది ఇళ్లలోకి వరద నీరు రావడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో బ్రహ్మాజీ కూడా తన ఇల్లు కూడా నీటిలో మునిగిపోయిందని తన ట్విట్టర్ లో తన ఇంటి ఫొటోలు పోస్ట్ చేశారు. దీనితో పాటు తాను బోటు కొనాలనుకుంటున్నానని సరదాగా కామెంట్ పెట్టారు. అంతే ఇక నెటిజన్స్ రెచ్చిపోయారు. బ్రహ్మాజీ వ్యాఖ్యలపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కామెంట్స్ పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ కామెంట్స్ పై స్పందిస్తూ బ్రహ్మాజీ.. మేము ఆ టైంలో బయట వున్నాం.. ఇంటికి కారులో వెళ్లే పరిస్థితి కూడా లేదు.. కారు కాలనీకి దూరంగా ఉంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చాం.. మేము వెళ్ళడానికి అక్కడ ఉన్న స్థానికులు చాలా హెల్ప్ చేశారు.. అందుకు నేను జోక్ గా బోట్ కొనాలనుకుంటున్నా అని కామెడీ చేశానని చెపుతూ.. ట్విట్టర్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశారు.
మరి చూడబోతే నెటిజన్స్ జోక్ ను జోక్ లా తీసుకునే పరిస్థితి కూడా లేదని అర్ధమైంది. ఎక్కడ చిన్న ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు ఎవర్ని ఏసుకుందామా అని కొంతమంది నెటిజన్స్ ఉంటారు. అలాంటి వాళ్లే ఇంత చిన్న విషయాలను కూడా పెద్ద ఇష్యూ చేసి చూపిస్తుంటారు. నిజం చెప్పాలంటే చాలా సందర్భాల్లో బ్రహ్మాజీ ఇలా హ్యూమర్ గానే ట్విట్టర్ లో ట్వీట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా అలానే చిన్న హ్యూమర్ చేశాడు. దానికి నెటిజన్స్ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. కామెడీ ని కామెడీ గా తీసుకుంటే బావుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బ్రహ్మాజీ అనే కాదు చిన్న విషయానికి కూడా సెలబ్రిటీస్ ను కార్నర్ చేయడం అలవాటైపోయింది. మరి సెలెబ్రిటీస్ ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటే ముందు ముందు ఇలాంటివి తగ్గే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: