బిగ్ బాస్ 4- బీభత్సం చేసిన రాక్షసులు 

బిగ్ బాస్ 4 – 7వ వారంలో ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్కు ఇచ్చేసాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా “కొంటె రాక్ష‌సుడు- మంచి మ‌నుషులు” అనే టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్ లో బిగ్‌బాస్‌పురం రాజ్యంలో అరియానా, అవినాష్‌, అఖిల్‌, మెహ‌బూబ్, హారిక‌ కొంటె రాక్ష‌సుల టీమ్‌లో ఉండ‌గా, నోయల్, అభిజిత్, లాస్య, అమ్మ రాజశేఖర్, మోనాల్, దివి, సోహెల్ మంచి మనుషులు టీమ్ లో ఉన్నారు. ఇక టాస్క్ లో ఒక్కో రాక్ష‌సుడిని మంచి మ‌నిషిగా మార్చిన ప్ర‌తీసారి రావ‌ణుడి బొమ్మ‌లోని ప‌ది త‌ల‌ల్లో రెండింటిని ప‌గ‌ల‌గొట్టాల్సి ఉంటుంది. అందుకు బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తాడు. టాస్క్ ను పూర్తి చేసిన ప్రతిసారీ రెండు తలలను పగల గొట్టాలి. అలా ముగ్గురు రాక్ష‌సులను‌ మార్చితేనే మ‌నుషుల టీమ్ గెలిచిన‌ట్లు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అలా బజర్ మోగిందో లేదో..  రాక్ష‌సుల టీం వ‌స్తువుల‌ను విసిరేస్తూ, దుస్తుల‌ను స్విమ్మింగ్ పూల్‌లో ప‌డేస్తూ ఇంటిని మొత్తం చింద‌ర‌వంద‌ర చేస్తూ బీభత్సం సృష్టించారు. ఒక రకంగా ఇది మంచి మనుషుల టీం స‌‌హ‌నానికి ఒక ప‌రీక్ష లాంటిదే అని చెప్పాలి.

నోయ‌ల్‌పై గుడ్డు ప‌గ‌ల‌గొట్టారు.. అవినాష్ రావ‌ణుడిలా డైలాగులు చెప్తూ సందడి చేసాడు… మెహ‌బూబ్ సోహైల్‌ను బ‌తికుండ‌గానే మ‌మ్మీలా మార్చాడు. ఇలా పలు రకాలుగా చిత్ర హింస‌లు పెడుతూ ఉన్న మంచి మనుషులు మాత్రం ఓపికతో వున్నారు. ఈ లోపు కొంటె రాక్ష‌సుల‌ను మంచిగా మార్చేందుకు బిగ్‌బాస్‌ మంచి మ‌నుషుల‌కు ఓ టాస్క్ ఇచ్చాడు. స్విమ్మింగ్ ఫూల్‌లోని పూల‌తో 50 దండాలు అల్లాల్సి ఉంటుంద‌ని తెలిపాడు. రాక్షసులు చెడగొడుతున్నా 50 దండలు చేయాలి. ఇక మనుషులు దండలు అల్లడం స్టార్ట్ చేస్తే రాక్ష‌సులు వాటిని పాడుచేస్తూ ఉంటారు. అయినా స‌రే మంచి మ‌నుషులు ఎట్ట‌కేల‌కు టాస్క్‌ను పూర్తి చేసి రాక్ష‌సుడి రెండు త‌ల‌లు పగ‌ల‌గొట్టారు. రాక్ష‌సుడిగా ఉన్న‌ అఖిల్‌ను వాళ్ల టీమ్‌లో క‌లిపేసుకున్నారు.

అనంత‌రం మంచి మ‌నుషుల‌కు క్లేతో 100 ప్ర‌మిద‌ల‌ను త‌యారు చేయాల‌ని బిగ్‌బాస్ మ‌రో టాస్క్ ఇచ్చాడు. కానీ వాళ్లు దీపాలు త‌యారు చేయ‌డం మొద‌లు పెట్ట‌గానే రాక్ష‌సులు క్లేల‌ను దొంగిలించారు. ఇక నోయ‌ల్ స్టోర్ రూమ్‌లోకి వెళ్లి గ‌డియ పెట్ట‌కుని మ‌రీ దీపాలు చేస్తుండ‌టంతో మెహ‌బూబ్‌, అవినాష్ ఆ రూమ్‌లోకి చొర‌బ‌డి మ‌రీ వాటిని దొంగిలించారు. మ‌రోవైపు సోహైల్ హారిక‌ను ఆపేందుకు పట్టుకోగా ఆమె అత‌డిని పంటితో గాటు పెట్ట‌డంతో కేక‌లు పెట్టాడు. ఇక లాస్య వాళ్లు క‌ష్ట‌ప‌డి మాస్ట‌ర్ ద‌గ్గ‌ర దీపాలు దాచిపెట్ట‌గా మిగ‌తావారు అత‌డి ద‌గ్గ‌రి నుంచి లేపేశారు. అయినా స‌రే 160 దీపాలు త‌యారు చేసి మ‌నుషుల టీమ్‌ విజ‌యం సాధించింది. మరోసారి రెండు తలలను పగలకొట్టి మెహబూబ్ ను మంచి మనుషుల టీంలో కలుపుకోవాలని అనుకున్నారు. కానీ అరియానా, మెహ‌బూబ్‌, అవినాష్బాత్రూమ్‌లో దాక్కోవడంతో హారికను మంచి మ‌నిషిగా మార్చారు.

మరి ఈ రోజు టాస్క్ లో అఖిల్, మెహబూబ్ మధ్య ఏదో వివాదం జరుగుతున్నట్టే కనిపిస్తుంది. చూద్దాం మరి ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారో.. ఎవరు కెప్టెన్సీ టాస్క్ వరకూ వెళ్తారో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 14 =