విభిన్న పాత్రలు చేయడంలో నిత్యామీనన్ ఎప్పుడూ ముందుంటుంది. చాలా సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకుంటూ.. ప్రతి కథలోనూ ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూసుకుంటుంది నిత్యా మీనన్. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ షూట్ లో పాల్గొంది నిత్యా మీనన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ మలయాళ దర్శకుడు దివంగత ఐవీ శశి తనయుడు అనీ శశి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు ‘నిన్నిలా నిన్నిలా’. ప్రముఖ తమిళ నటుడు, ‘పిజ్జా 2’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, రీతూ వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.
కాగా బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్పై బీవీఎస్ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లండన్ నేపథ్యంలో జరిగిన థ్రిల్లర్ సినిమా కావడంతో.. అక్కడే షూటింగ్ మొత్తం జరుపుకున్నట్టు తెలుస్తుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
కాగా సుజనా రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గమనం సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలో నిత్యా శైలపుత్రీదేవి అనే శాస్త్రీయ సంగీత గాయని పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా కాకుండా త్వరలోనే ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీతో రానుంది నిత్యా. ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్ ఇదివరకెన్నడూ పోషించని పాత్రలో కనిపిస్తుందని టాక్. కరోనా వల్ల సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ సినిమాను నాలుగు భాషలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు హిందీలోనూ ఏకకాలంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: