మిల్కీబ్యూటీ తమన్నా ఇటీవలే కోవిడ్ బారి నుండి బయట పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఓ షూటింగ్ కోసం వచ్చిన తమన్నాకు కరోనా సోకడంతో హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంది. ఇప్పుడు తగ్గిపోయిందనుకోండి. కరోనా తగ్గిపోవడంతో తిరిగి తన హోమ్ టౌన్ ముంబై కూడా తిరిగి వెళ్ళిపోయింది తమన్నా. అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల ప్రార్థనలతోనే నేను త్వరగా వచ్చానని కూడా తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇపుడు తాజాగా తనకు కోవిడ్ సమయంలో వైద్యం అందించిన వైద్యులకు ధన్యవాదాలు చెబుతూ ట్విట్టర్లో మెసేజ్ పోస్ట్ చేసింది. “కాంటినెంటల్ హాస్పిటల్లోని డాక్టర్స్, నర్సులు, స్టాఫ్ చేసినదానికి మాటల్లో చెపితే సరిపోదు.. నేను జ్వరంతో వీక్ అయినప్పుడుచాలా భయపడ్డాను.. కానీ మీరు ధైర్యాన్ని ఇచ్చి మంచి మంచి వైద్యాన్ని అందించారు. మీ దయ, కేరింగ్తో నేను త్వరగా బయటపడ్డాను” అని ట్వీట్ లో పేర్కొంది.
Words cannot describe how grateful I am to the doctors, nurses and the staff at @Continental_hyd. I was so sick, weak & scared but the you made sure that I was comfortable and treated in the best possible way. The kindness, sincere caring, and concern made everything better! 🙏🏼😇 pic.twitter.com/nSKBC19UwU
— Tamannaah Bhatia (@tamannaahspeaks) October 17, 2020
తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీలో నటిస్తుంది. ఈ సినిమాలో కబడ్డీ కోచ్ గా నటిస్తుంది. . ఇంకా కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్ టైల్’ సినిమా రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’, ‘అంధాదున్’ తెలుగు రీమేక్లో కూడా తమన్నా నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: