దాదాపు టాలీవుడ్ హీరోలందరూ షూటింగ్ లను మొదలు పెట్టేసారు. యంగ్ హీరోలు అయితే చాలా మంది షూట్ ను మొదలుపెట్టేసారు. కొంతమంది అయితే షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇక అగ్ర హీరోల్లో ముందు నాగార్జున షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు షూటింగ్ కోసం విదేశాలకు కూడా వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు మరో అగ్ర హీరో కూడా షూట్ కు రెడీ అయిపోయాడు. ఆ హీరో ఎవరో కాదు వెంకీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకీ ప్రధాన ప్రధాన పాత్రలో తమిళంలో హిట్టయిన ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందుగానే 75 శాతం వరకూ ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇక ఇప్పుడు ఆరు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ షూట్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. నవంబర్ మొదటి వారం నుంచి తదుపరి షూటింగును మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు ఇకపై బ్రేక్ లు లేకుండా సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేయాలని చూస్తున్నారట చిత్రయూనిట్. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
కాగా ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: