వరల్డ్ ఫుడ్‌ డే.. ఏం తింటున్నారో దాన్ని ప్రేమించండి

Namrata Shirodkar Pens A Thoughtful Post About Food On Instagram On The Occasion Of World Food Day

ఆర్గానిక్ ఫుడ్ తినాలని.. మనకు కావాల్సిన కాయగూరలు ఇంట్లోనే పండించుకొని తినమని ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత కూడా అదే చెపుతుంది. అసలు సంగతేంటంటే ఈరోజు వరల్డ్ ఫుడ్‌ డే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నమ్రతా శిరోద్కర్‌ ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్నం, కూరలతో ఉన్న ఓ పిక్‌ని ఆమె షేర్‌ చేస్తూ..”మీకు నచ్చిన ఆహారం తినండి. ఏం తింటున్నారో.. దానిని ఇష్టపడండి. ఆరోగ్యకరమైన ఆహారం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. ఆర్గానిక్‌ ఫుడ్‌ తీసుకుంటే ఇంకా మంచిది. అది పోషకాహారమే కాదు ఆరోగ్యం, ఆనందం నిండి ఉంటుంది. రుచిగా ఉందా లేదా అని దానిపై చర్చలు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యం కోసం మనమే జాగ్రత్త తీసుకోవాలి.. మంచి ఆహారాన్ని తినండి” అని నమ్రతా శిరోద్కర్‌ పేర్కొన్నారు.

 

నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 18 =