కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభం లో పడిన విషయం తెలిసిందే. మూవీ షూటింగ్స్ నిలిచిపోయి చిత్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు ఇబ్బందికి గురి అయ్యాయి. సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయ్యారు. సుమారు 6 నెలల తరువాత షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యి చిత్ర పరిశ్రమ కళ కళ లాడుతుంది. కరోనా టైమ్ లో షూటింగ్స్ నిలిచిపోయిన సినిమాలు ఒక్కొక్కటిగా
షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. థియేటర్స్ రీ ఓపెనింగ్ తో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని అందరూ ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రైతు సమస్యల నేపథ్యంలో “శ్రీకారం ” మూవీ రూపొందుతుంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. లాక్ డౌన్ తరువాత కొన్ని రోజుల క్రితం హీరో శర్వానంద్ తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. శర్వానంద్ ఇప్పుడు “శ్రీకారం “మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. కరోనా జాగ్రత్త లతో తిరుపతి పరిసర ప్రాంతాలలో “శ్రీకారం “మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. ఈనెలాఖరు లోపల షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుందని సమాచారం. హీరో శర్వానంద్ “మహాసముద్రం “మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: