సూపర్స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ను పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన పిల్లలు స్విమ్ చేస్తున్న వీడియోని ఇన్స్టాగ్రమ్ ద్వారా షేర్ చేస్తూ.. మా పిల్లలు ఒలంపిక్స్కు రెడీ. వాళ్లకి ఇష్టమైన గేమ్స్ ప్రోత్సహిస్తూనే.. అన్నింటిలో ప్రావీణ్యం ఉండాలని చెబుతుంటాను. వ్యాయామంతో పాటు ఏదైనా ఆట ఆడుతూ ఉంటే.. మెదడు ఉత్తేజితమవుతుంది..” అని నమ్రత పేర్కొంది. ప్రస్తుతం గౌతమ్, సితారలు స్విమ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: