మొత్తానికి థియేటర్లు తెరుచుకునే టైం వచ్చేసింది. లాక్ డౌన్ వల్ల గత 8 నెలల నుండి థియేటర్స్ మూతపడే ఉన్నాయి. లాక్ డౌన్ తీసినా కూడా థియేటర్స్ కు మోక్షం రాలేదు ఇన్ని రోజులు. ఇక ఎంతో మంది సినీ లవర్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ను మిస్ అయ్యారు. ఇక ఇప్పుడు అటు సినీ ఇండస్ట్రీకే కాదు.. సినీ లవర్స్ కు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. అన్లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్లను 50 % సిట్టింగ్ తో తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. దీనితో కొన్ని నెలల తర్వాత మళ్ళీ ధియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో తమ సినిమాలను ధియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే లాక్ డౌన్ లో కూడా తీరిక లేకుండా సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ అలా థియేటర్స్ ఓపెన్ అయ్యాయో లేదో ఇలా తన సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు. అంతేకాదు ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా కూడా తెలిపాడు. ” మొత్తానికి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. లాక్డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమాగా `కరోనా వైరస్` నిలుస్తుందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది” అంటూ వర్మ వెల్లడించాడు. మరి చూద్దాం వర్మ కరోనా ను చూడటానికి ఎవరైనా వస్తారా..? కరోనాకు భయపడి ఇంట్లోనే వుంటారా.. ?
ఇక ఈ లాక్ డౌన్ లో ఇండస్ట్రీ మొత్తం షూటింగ్ లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ఎలాంటి భయం లేకుండా వరుసగా సినిమాలు షూటింగ్ లు చేసిన ఏకైక వ్యక్తి వర్మ మాత్రమే. ప్రస్తుతం వర్మ ప్రకటించిన వాటిలో ‘కరోనా’ ‘మర్డర్’ ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ ‘ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ’, 12 ‘O’ క్లాక్, ‘పవర్ స్టార్’,’డేంజరస్’ అనే సినిమాలు వున్నాయి. మరి ఇన్ని సినిమాల్లో ఎన్ని సినిమాలు విడుదల అవుతాయో.. ఏంటో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: