సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది 2019 అక్టోబర్ 2 న రిలీజ్ అయి నేటితో ఒక ఏడాది పూర్తి చేసుకుంది. చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుధీప్, విజయ సేతుపతి లాంటి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ చిరు తో స్క్రీన్ ను షేర్ చేసుకోగా.. విజువల్ వండర్గా తీర్చిదిద్దిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా ఈ సినిమాను నిర్మించిన రాంచరణ్ ఈ సినిమాను తన ట్విట్టర్ ద్వారా గుర్తుచేసుకున్నారు. బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ కాస్ట్, బ్రిలియంట్ టీం.. సైరా సినిమా రిలీజ్ అయి ఒక ఏడాది పూర్తయింది.. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించాడు.
Best EXPERIENCE !!
Best CAST!! &
A BRILLIANT team!!
A year since #SyeRaa released.
Thank you one and all.@SrBachchan @KChiruTweets @DirSurender #Nayanthara @KicchaSudeep @VijaySethuOffl @IamJagguBhai @ravikishann @tamannaahspeaks @KonidelaPro #MahatmaGandhi pic.twitter.com/dQJcR5rVRA— Ram Charan (@AlwaysRamCharan) October 2, 2020
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య ” మూవీ లో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ఆచార్య ” మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: