కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాల షూటింగ్లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. నిన్న మొన్నటివరకూ ఇక్కడే షూటింగ్ స్టార్ట్ చేయగా ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాధేశ్యామ్ టీం కూడా ఇటలీకి పయనమైనట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ ముందు అక్కడ కొంత చిత్రీకరణ జరుపుకుంది రాధేశ్యామ్ సినిమా. కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక మొన్నటి వరకూ విదేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో అక్కడ చాలా వరకూ షూటింగ్లకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు విదేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే రాధేశ్యామ్ షూటింగ్ కోసం వెళ్లిపోయారు. వీలైనంత తొందరగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసి తిరిగి వచ్చేయాలని ప్లాన్ చేసుకున్నారట టీమ్. అక్టోబర్ నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Darling #Prabhas looks dashing as he gets papped📸 at Hyderabad Airport! 🔥😎#RadheShyam #DarlingPrabhas #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/BFu99PR7FS
— Telugu FilmNagar (@telugufilmnagar) October 1, 2020
కాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇక రాధే శ్యామ్ షూటింగ్ కోసం చాలా ఎదురు చూస్తున్నానని పూజా హెగ్డే ఇటీవలే తెలిపింది. అదే సెట్ లో రెండు పుట్టినరోజులు ఉన్నాయని చెప్పుకొచ్చింది. మరి బుట్టబొమ్మ కోరిక తీరినట్టే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: