సెకండ్ ఇన్నింగ్స్ లో పలు ఇంటరెస్టింగ్ కథలతో దూసుకుపోతుంది ప్రియమణి. ఎవరే అతగాడు సినిమాతో అరంగేట్రం చేసినా.. ‘పెళ్ళైనకొత్తలో సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది ప్రియమణికి. ఇక ఆ సినిమాతో వరుసగా ఆమెకు సినిమా ఆఫర్స్ వచ్చాయి. తన పదిహేనేళ్ల కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ ఇలా పలు భాషా చిత్రాల్లో నటించింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి.. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఏ పాత్ర పడితే ఆ పాత్ర కాకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ పోతుంది. ఇప్పటికే విరాట పర్వం సినిమాలో ‘కామ్రేడ్ భారతక్క’ అనే కీలక పాత్రలో నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇపుడు మరో డిఫరెంట్ కథలో నటిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ టచ్రివర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సైనైడ్’ అనే సినిమాలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుంది. మిడిల్ ఈస్ట్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎన్నారై పారిశ్రామికవేత్త ప్రదీప్ నారాయణన్ నిర్మిస్తున్నారు. దేశంలోనే సంచలనం సృష్టించిన ‘సైనైడ్’ మోహన్ కేసు ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషలలో సినిమాను రూపొందిస్తున్నారు. దక్షిణాది భాషల్లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుండగా…హిందీలో ఆ పాత్రలో యశ్ పాల్ శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి ఇన్వెస్టిగేషన్ పోలీస్ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది
కాగా ఇంకా ఈ సినిమాలో చిత్రంజన్ గిరి, తణికెళ్ల భరణి, రాంగోపాల్ బజాజ్, సిజ్జు, శ్రీమాన్, సమీర్, రోహిణి, సంజు శివరామ్, షాజు ముకుందన్, రిజు బజాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సదాత్ సైనూద్దీన్ సినిమాటోగ్రఫీ అందించనుండగా.. అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జార్జ్ జోసెఫ్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: