కోట్లాది ప్రజలను తన గాన మాధుర్యంతో ఆకట్టుకున్న లెజెండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం కు భారత దేశ అత్యున్నత “భారత రత్న “పురస్కారం అందజేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , భారత ప్రధాని నరేంద్ర మోదీ కి ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. బాలు కు భారతరత్న పురస్కారం పై విజ్ఞప్తి చేసిన జగన్ కు తమిళ సూపర్ స్టార్ , మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తన మద్దతు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐదున్నర దశాబ్దాలుగా 16 భాషలలో 40, 000 పైగా సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన ఎస్ పి బాలు భారత రత్న పురస్కారానికి అన్ని విధాలా అర్హులే. ఎస్ పి బాలు కు భారత రత్న పురస్కారం అందజేయాలని ప్రధానిని కోరినందుకు సి ఎమ్ జగన్ కు కమల్ హాసన్ ధన్యవాదాలు తెలిపారు. గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలని , ఎస్ పి బాలుకు భారత రత్న పై మీరు చేసిన విజ్ఞప్తి గౌరవమైనదనీ , సరైనదనీ , దేశవ్యాప్తంగా ఉన్న బాలు అభిమానులు ఇదే గొంతు వినిపిస్తారనీ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: