కరోనా కారణంగా ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక బాలు మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ప్రతి ఒక్కరూ బాలుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. బాలు మరణంతో ఒక శకం ముగిసిందని… గాంధర్వ లోకానికి వెళ్లారని.. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయిందని అందరూ గుర్తుచేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక బాలు పార్ధీవ దేహాన్ని ముందుగా ఇంటికి తరలించగా.. అక్కడకు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఫాంహౌజ్కు తరలించారు. నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. తిరువళ్ళూరు జిల్లా తామరైపాక్కం ఫాం హౌజ్లో అంత్య క్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక ఖననం చేశారు. ఇక కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు అనుమతించారు.
ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.ఇక సినీ సెలబ్రిటీలు దేవి శ్రీ ప్రసాద్, భారతీరాజా, మనో, సీనియర్ నటుడు అర్జున్, హీరో విజయ్ తదితరులు అంత్యక్రియలలో పాల్గొన్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: