ఇటీవలే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి కరోనా నుండి కోలుకున్న సంగతి తెలిసిందే. కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం కూడా చేశారు. ఇక అలా రికవర్ అయ్యారో లేదో అప్పుడే వర్క్ మోడ్ లోకి వెళ్లిపోయారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు పలు సినిమాలకు కూడా కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసినిమాల పనిలో ఉన్నట్టు చెపుబుతున్నాడు కీరవాణి. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం తాను రెండు సినిమాలకు పని చేస్తున్నానని.. అందులో క్రిష్ జాగర్లమూడి-పవన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా.. ఇంకోటి కే రాఘవేంద్రరావు గారి సినిమా అని.. ఆర్ఆర్ఆర్ సినిమా పని కూడా త్వరలోనే మొదలు పెడతానని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
And on a non Covid note, am working for 2 movies right now , Krish’s own production and KRR’s own production. RRR work will be resumed soon.
— mmkeeravaani (@mmkeeravaani) September 21, 2020
ఇదిలా ఉండగా ఒక్కసారి ప్లాస్మా డొనేట్ చేయడానికే అందరూ ఆలోచిస్తుంటే కీరవాణి మాత్రమే రెండోసారి మళ్ళీ ప్లాస్మా దానం చేసి గ్రేట్ అనిపించుకున్నారు. తాజాగా ఆయన తన కుమారుడితో కలిసి రెండో సారి ప్లాస్మాదానం చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘మా రక్తంలో యాంటీ బాడీస్ ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు..దీంతో నేను, మా కుమారుడు కిమ్స్లో రెండోసారి ప్లాస్మా దానం చేశాము. ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్లాస్మాదానం చేసినా ఏమీ కాదు.. సంతోషంగా ఉంది’ అని తెలిపారు.
As they found antibodies still active in our blood, myself and my son donated plasma for second time at KIMS. No need to worry about donating more than once. Feeling good again 😊 pic.twitter.com/r2DAJN7zjl
— mmkeeravaani (@mmkeeravaani) September 21, 2020
కాగా మనసు మమత మూవీ తో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన ఏం ఏం కీరవాణి మూడు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం పలు తెలుగు ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: