‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో రానున్న ‘మహాసముద్రం’ సినిమాపై ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. టాలెంటెడ్ నటుడు శర్వానంద్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో మరో హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఇక ఇప్పుడు దీనిపై కూడా అధికారిక ప్రకటన ఇచ్చేసారు. ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
He is an ocean of talent and returns back to Telugu Cinema..Welcoming @Actor_Siddharth on board for #Mahasamudram 🌊 @ImSharwanand @DirAjayBhupathi @AKentsOfficial @AnilSunkara1 #SidIsBack
More interesting updates soon! 💥 pic.twitter.com/HKgzlrHZW0
— AK Entertainments (@AKentsOfficial) September 18, 2020
కాగా దాదాపు ఏడేళ్ల గ్యాప్తో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులను పకలరించనున్నారు. బాయ్స్, ‘బొమ్మరిల్లు’, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలు సిద్ధార్థ్కు హీరోగా మంచి గుర్తింపునే తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత సిద్ధార్థ్ చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. చివరిసారిగా డబ్బింగ్ ఫిలిం ‘గృహం’తో ఆయన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్ట్రయిట్ తెలుగు సినిమాలో మాత్రం నటించనేలేదు. ఇన్నేళ్లకు సరైన స్క్రిప్ట్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని ఎదురుచూస్తున్న ఆయన ఎట్టకేలకు ‘మహాసముద్రం’ రూపంలో అలాంటి స్క్రిప్టు రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చూద్దాం మరి ఈ సినిమా సిద్దార్థకు మంచి కమ్ బ్యాక్ సినిమా అవుతుందేమో.
సూపర్స్టార్ మహేష్బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి మాసివ్ బ్లాక్బస్టర్ను నిర్మించిన ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. దాని తర్వాత ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన ‘మహాసముద్రం’ను నిర్మిస్తోంది. సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: